Education

AP Intermediate Exam Results 2024:ఇంటర్ పరీక్ష ఫలితాలు నేడే విడుదల.....

KJ Staff
KJ Staff

విద్యార్థులు మరియు తల్లితండ్రులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న, ఆంధ్ర ప్రదేశ్ ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. ఈ రోజు ఉదయం 11 గంటలకు ఫస్ట్ ఇయర్ మరియు సెకండ్ ఇయర్ ఫలితాలు ఒకే రోజు విడుదల చెయ్యనున్నారు. ఇంటర్ పరీక్షలు పూర్తయిన 22 రోజుల్లోనే ఫలితాలు వెల్లడించడం గమనార్హం.

మార్చ్ నెల 1 వ తారీఖు నుండి 20 తారీఖు వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహించారు. 20 రోజుల పాటు కొనసాగిన ఈ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 10,53,435 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలకు, 5,17,570 మంది విద్యార్థులు పరీక్ష రాయగా, 5,35,865 మంది రెండవ సంవత్సరం విద్యార్థులు, పరీక్ష రాసారు. అనుకున్న విధంగానే ఈ సారి త్వరితగతిన పరీక్ష ఫలితాలు వెల్లడిస్తున్నారు. ఇంటర్మీడియట్ ఫలితాలను ఆధారం చేసుకుని, వివిధ యూనివర్సిటీలలో ప్రవేశాలు కల్పిస్తారు.

పరీక్ష ఫలితాల చెక్ చేసుకోవడానికి ఈ కింద ఇవ్వబడిన లింక్స్ ద్వారా తెలుసుకోండి:

Share your comments

Subscribe Magazine