Education

ఏపీలో గ్రూప్‌-1 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ!

Srikanth B
Srikanth B

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త ప్రకటించింది , వివిధ విభగాల్లో లో ఖాళీగా వున్నా గ్రూప్ 1 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది అక్టోబర్‌ 13 నుంచి నవంబర్‌ 2 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు . ఎఎంవీఐ పోస్టులకు నవంబర్‌ 2 నుంచి 22 వరకు..ఇంటర్వ్యూల విధానం పునరుద్ధరిస్తూ ఉత్తర్వులు జారీ ,గరిష్ట వయోపరిమితి మరో రెండేళ్లు పొడిగింపు ప్రకటిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది .

ఇదే నోటిఫికేషన్‌లో గ్రూప్‌-1 పోస్టులతో పాటు అసిస్టెంట్‌ మోటార్‌ వెహికిల్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్టులను కూడా భర్తీ చేయడానికి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ఆహ్వానించింది. ఈ మేరకు ఏపీపీఎస్సీ కార్యదర్శి హెచ్‌. అరుణ్‌కుమార్‌ ఒక ప్రకటన విడుదల చేశారు.

గ్రూప్‌-1 పోస్టులు 92 ఉండగా అసిస్టెంట్‌ మోటార్‌ వెహికిల్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్టులు 17 ఉన్నాయి. ఇక గ్రూప్‌-1 పోస్టుల దరఖాస్తుకు అక్టోబర్‌ 13 నుంచి నవంబర్‌ 2 వరకు, ఎఎంవిఐ పోస్టులకు నవంబర్‌ 2 నుంచి 22 వరకు గడువు విధించారు. పూర్తి వివరాలను కమిషన్‌ వెబ్‌సైట్‌ psc.ap.gov.in/ లో చూడొచ్చని కార్యదర్శి పేర్కొన్నారు.

Garib Kalyan yojana : మరో మూడు నెలలు ఉచితం గ బియ్యం పంపిణి !

గ్రూప్‌-1 సహా అత్యున్నత కేడర్‌ పోస్టులకు ఇంటర్వ్యూలు
ఇలా ఉండగా.. ఏపీపీఎస్సీ ద్వారా నిర్వహించే గ్రూప్‌-1 సహా ఇతర అత్యున్నత కేడర్‌ పోస్టులకు రాత పరీక్షలతో పాటు ఇంటర్వ్యూలను కూడా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో రద్దు చేసిన ఇంటర్వ్యూల విధానాన్ని పునరుద్ధరించింది. ఈ అత్యున్నత పోస్టులన్నింటికీ ప్రిలిమ్స్, మెయిన్స్‌లలో అర్హత సాధించిన అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించేలా శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.

Garib Kalyan yojana : మరో మూడు నెలలు ఉచితం గ బియ్యం పంపిణి !

Share your comments

Subscribe Magazine