Education

తెలంగాణాలో తొలి మహిళా విశ్వ విద్యాలయం...100 కోట్ల కేటాయింపు!

S Vinay
S Vinay

ప్రస్తుతం హైదరాబాద్, కోఠిలో ఉన్న మహిళా కళాశాలను ఆధునీకరిస్తూ రాష్ట్రంలోనే తొలి మహిళా యూనివర్సిటీని ఏర్పాటు చేయడానికి తెలంగాణ ప్రభుత్వం సోమవారం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది

విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రభుత్వ ఉత్తర్వుల కాపీలను ఉన్నత విద్యాశాఖ ఉన్నతాధికారులకు అందజేసి తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి (Telangana State Council of Higher Education)ని అభినందించారు.వారు ఈ సందర్భాంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో తొలి మహిళా విశ్వవిద్యాలయాన్ని, మహిళలు ఉన్నత విద్యలో అగ్రగామిగా ఉండేలా దీనిని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

కోటి మహిళా కళాశాలను మహిళా విశ్వవిద్యాలయంగా మార్చాలని ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ డి.రవీందర్‌ను కోరారు.సంబంధిత పనులకు రూ.100 కోట్లు కేటాయించారు.అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా కొత్త కోర్సులను ప్రవేశపెట్టాలని ఉన్నత విద్యాశాఖ అధికారులను ఆమె ఆదేశించారు.భవిష్యత్తులో ఈ విశ్వవిద్యాలయం అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు.

'తెలంగాణ విశ్వవిద్యాలయాల చట్టం 1991 ప్రకారం, విశ్వవిద్యాలయంలో మౌలిక సదుపాయాలు మరియు ఇతర సౌకర్యాలను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది'. అని తెలంగాణ ఉన్నత విద్యామండలి అధికారులు తెలిపారు.

కోటిలోని మహిళా కళాశాలలో ఉన్న బోధన, బోధనేతర పోస్టులతో సహా మిగితా ఆస్తులను ఉస్మానియా యూనివర్సిటీ అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ నుంచి కొత్తగా ఏర్పాటు చేసిన మహిళా విశ్వ విద్యాలయానికి బదిలీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

తెలంగాణ మహిళా విశ్వ విద్యాలయం స్థాపన మహిళా విద్యార్థులకు మంచి అవకాశాలను అందిస్తుంది మరియు రాబోయే సంవత్సరాల్లో ఇది ఒక ప్రముఖ విశ్వవిద్యాలయంగా మారుతుంది" అని TSCHE చైర్మన్, ప్రొఫెసర్. R. లింబాద్రి తెలిపారు.

మరిన్ని చదవండి.

వ్యవసాయ రంగంలో వనిత ప్రాముఖ్యత

Related Topics

womens university telangana

Share your comments

Subscribe Magazine