Education

నేడే మధ్యాహ్నం 12 గంటలకు పదో తరగతి ఫలితాలు !

Srikanth B
Srikanth B
Telangana SSC results 2023
Telangana SSC results 2023

రాత్రి పగలు కష్ట పడి చదివిన పదోతరగతి విద్యార్థుల భవిష్యత్తు నేడు నిర్దారించబడనుండి , ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు తెలంగాణ పదోవ తరగతి పరీక్షా ఫలితాలను తెలంగాణ విద్య శాఖ మంత్రి సబిత ఇంద్ర రెడ్డి విడుదల చేయనున్నట్లు సంచాలకుడు కృష్ణారావు తెలిపారు .

ఏప్రిల్‌ 3వ తేదీ నుంచి 12వ తేదీ వరకు జరిగిన పరీక్షలకు 4,84,370 మంది హాజరయ్యారు. ఆదిలాబాద్‌ జిల్లా ఉట్నూరులో తొమ్మిది మంది పాత విద్యార్థులకు సంబంధించి తెలుగు పరీక్ష జవాబుపత్రాల బండిల్‌ కనిపించకుండా పోయిన నేపథ్యంలో వారిని ఇంటర్నల్ మార్కులు ఆధారంగా పాస్‌ చేసినట్లు తెలిసింది.

పరీక్షా ఫలితాలను విద్యార్థులు bse.telangana.gov.in, http://www.manabadi.co.in/ bseresults.telangana.gov.in,  తదితర వెబ్సైటు ద్వారా తెలుసుకోవచ్చు .

Share your comments

Subscribe Magazine