Government Schemes

రైతులకు అలర్ట్‌.. ఈ పని చేస్తేనే వారి ఖాతాల్లో పీఎం కిసాన్ డబ్బులు జమ..!

Gokavarapu siva
Gokavarapu siva

ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన అనేది చిన్న మరియు సన్నకారు రైతులకు పంట పెట్టుబడి సహాయాన్ని అందించే ప్రభుత్వ పథకం. ఈ పథకం ద్వారా రైతులకు వార్షిక సహాయం మొత్తం రూ.6000 ప్రభుత్వం అందిస్తుంది. రైతులను ఆదుకోవడానికి మరియు వారి పంట సంబంధిత ఖర్చులకు సహాయం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని రూపొందించింది.

ఈ పథకం ప్రకారం, ప్రభుత్వం ప్రతి 4 నెలల వ్యవధిలో 3 విడతలుగా రైతుల ఖాతాలకు రూ.2,000 జమ చేస్తున్నారు. 2019 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు 14 వాయిదాలను రైతుల ఖాతాలకు ప్రభుత్వం జమ చేసింది. ప్రస్తుతం 15వ విడత ఎప్పుడెప్పుడా అని రైతులు ఎదురు చూస్తున్నారు.

అయితే కొందరు రైతులకు గత విడత డబ్బులు రాలేదు. అందుకు కారణం తెలుసుకోవడం చాలా ముఖ్యం. చిన్నపాటి పొరపాటు జరిగినా మీ అకౌంట్లో డబ్బులు పడవని గుర్తించుకోవాలి. మీరు సెప్టెంబర్ 30లోపు కొన్ని ముఖ్యమైన పనిని పూర్తి చేయాల్సి ఉంటుంది. అయితే చాలా మంది రైతులు కేవైసీ చేసుకోకపోవడం కారణంగా వారికి పీఎం కిసాన్‌ డబ్బులు అందలేదు. ప్రతి ఒక్క రైతు తమ ఆధార్‌ వివరాలతో పూర్తి కేవైసీ చేసుకోవాలని సూచిస్తూ వస్తోంది. అయినా కొందరు రైతులు ఈ పని చేయకపోవడం కారణంగా వారికి డబ్బులు అందలేదు.

ఇది కూడా చదవండి..

త్వరలోనే వారికి రూ.లక్ష ఆర్ధిక సహాయాన్ని అందించనున్న ప్రభుత్వం.. ఎవరు అర్హులంటే?

14వ విడత అందని అర్హులైన రైతులు PM కిసాన్ హెల్ప్‌డెస్క్‌లో ఫిర్యాదు చేయాలని కూడా పేర్కొనడం గమనార్హం . హెల్ప్‌లైన్ నంబర్లు 011-24300606 మరియు 155261, మరియు టోల్-ఫ్రీ నంబర్ కూడా అందుబాటులో ఉంది: 18001155266. రైతులు తమ ఫిర్యాదులనుpmkisan-funds@gov.inలేదా pmkisan-funds@gov.in ఇమెయిల్ ద్వారా నమోదు చేసుకోవచ్చు.

PM కిసాన్ యొక్క 15వ వాయిదాలను పొందడానికి, e-KYC ప్రక్రియను పూర్తి చేయాలి. మీరు ఇంకా KYC చేయకుంటే, త్వరగా పూర్తి చేయండి. మీరు సమీపంలోని CSC కేంద్రం లేదా PM కిసాన్ పోర్టల్ pmkisan.gov.in ద్వారా మీ రిజిస్ట్రేషన్‌ను చేసుకోవచ్చు. పీఎం కిసాన్ యోజన కోసం నమోదు చేసుకునేటప్పుడు ఈ విషయాలను గుర్తుంచుకోండి . మీరు నింపిన దరఖాస్తు ఫారమ్‌లో పేరు మరియు చిరునామాకు సంబంధించి ఎటువంటి పొరపాటు చేయవద్దు. ఇది కాకుండా, మీ లింగం , పేరు , ఆధార్ నంబర్‌ను సరిగ్గా పూరించండి. ఈ చిన్న చిన్న పొరపాట్ల వల్ల మిమల్ని వాయిదాల నుండి తప్పించవచ్చు.

ఇది కూడా చదవండి..

త్వరలోనే వారికి రూ.లక్ష ఆర్ధిక సహాయాన్ని అందించనున్న ప్రభుత్వం.. ఎవరు అర్హులంటే?

Share your comments

Subscribe Magazine

More on Government Schemes

More