Government Schemes

ప్రధాన మంత్రి ఆదర్శ్ గ్రామ్ యోజన: 36,428 గిరిజన గ్రామాల అభివృద్ధి !

Srikanth B
Srikanth B

భారతదేశంలో అధికారికంగా షెడ్యూల్డ్ తెగలుగా గుర్తించబడిన 705 జాతులు ఉన్నాయి. వీటిలో ముఖ్యంగా  లక్షద్వీప్, మేఘాలయ, మిజోరాం, ఒడిశా, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, బీహార్, మధ్యప్రదేశ్, దాద్రా & నగర్ హవేలీ, తమిళనాడు, కేరళ, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ మరియు నాగాలాండ్‌లు లలో  ఎక్కువగా ఉన్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం, మధ్యప్రదేశ్ ఏ రాష్ట్రంలో లేని అత్యధిక గిరిజన జనాభాను కలిగి ఉంది.

ప్రధాన మంత్రి ఆదర్శ్ గ్రామ్ యోజన దేశవ్యాప్తంగా 36,428 గిరిజన ప్రాబల్య గ్రామాలను 'ఆదర్శ గ్రామాలు'గా  మార్చడానికి ప్రయత్నిస్తుంది . ఈ పథకం ద్వారా   కేంద్రప్రభుత్వం వారికి అన్ని మౌలిక వసతులు కల్పించనుంది . ఇందుకోసం ప్రభుత్వం రూ.7,300 కోట్లు కేటాయించింది.

"మోదీ ప్రభుత్వం 36,428 గిరిజన ప్రాబల్యం ఉన్న గ్రామాలను ఆదర్శ గ్రామ్‌లుగా అభివృద్ధి చేయడమే కాకుండా, గిరిజన సమాజంలో గౌరవనీయమైన వ్యక్తులు అనే భావనను సృష్టించడానికి భగవాన్ బిర్సా ముండా జయంతిని ప్రతి నవంబర్‌లో జరుపుకోవాలని నిర్ణయించింది.

ఎస్సీ, ఎస్టీ వర్గాల పిల్లలకు మెరుగైన విద్యను అందించే విధం  ‘ఏక్లవ్య’ మోడల్ స్కూల్‌ను  నిర్మించినట్లు ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఐదేళ్లలో, ఈ కార్యక్రమం కింద 452 కొత్త పాఠశాలలను నిర్మించాలని మరియు ఇప్పటికే ఉన్న 211 పాఠశాలలను పునరుద్ధరించాలని ప్రభుత్వం యోచిస్తోందని ,కేంద్ర బడ్జెట్‌లో ఎస్సీ, ఎస్టీ వర్గాల పిల్లల చదువుల కోసం ప్రభుత్వ కేటాయింపు రూ.1,100 కోట్ల నుంచి రూ.6,000 కోట్లకు పెంచింది అని ప్రధాని తెలిపారు .

ప్రధాన మంత్రి ఆదర్శ్ గ్రామ యోజన గురించి:

ప్రధాన్ మంత్రి ఆదర్శ్ గ్రామ యోజన (PMAGY) అనేది షెడ్యూల్డ్ కులాలకు చెందిన అధిక శాతం (50% కంటే ఎక్కువ) ప్రజలు ఉన్న గ్రామాల అభివృద్ధి కోసం 2009–10 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన భారతదేశంలో గ్రామీణ అభివృద్ధి కార్యక్రమం.


ఇది కూడా చదవండి.

ప్రధానమంత్రి కిసాన్ & ఇతర వ్యవసాయ పథకాలు రైతులకు కొత్త బలాన్ని అందిస్తున్నాయి: ప్రధాని మోదీ

 

Share your comments

Subscribe Magazine

More on Government Schemes

More