Health & Lifestyle

మూడు రోజుల పాటు ఈ ఫేస్ ప్యాక్ వాడితే, పార్లోర్ లాంటి గ్లో ఇంట్లోనే....

KJ Staff
KJ Staff

ఇంట్లో ఏమైనా శుభకార్యాలు, లేదా ఏమైనా ఫంక్షన్లకు వెళ్లాలంటే, బ్యూటీ పార్లోర్ కి వెళ్లి పేస్ ప్యాక్స్ వేయించుకుంటారు. హానికారక కెమికల్స్ తో తయారుచేసిన ఈ బ్యూటీ ప్రోడక్టులు కొన్ని సార్లు స్కిన్ అలెర్జిస్ కలిగించవచ్చు. ఇలా కాకుండా సజసిద్ధంగానే ఇంట్లో తయారుచేసిన పేస్ ప్యాకులు వినియోగించడం ద్వారా అతి తక్కువగా రోజాల్లో మొఖాన్ని మెరిపించవచ్చు. వీటివలన చర్మానికి ఎటువంటి హాని ఉండదు, పైగా వీటికయ్యే ఖర్చు కూడా చాలా తక్కువ. ఇంట్లో తయారుచేసుకునే ఈ ఫేస్ ప్యాకుల ద్వారా మొఖంపై మచ్చలు మరియు మొటిమలు కూడా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఒక్కసారే పోకపోయిన ఈ ఫేస్ ప్యాకును తరచూ వాడటం ద్వారా ఈ మచ్చలను పూర్తిగా తగ్గించవచ్చు.

బియ్యం నీటితో పేస్ ప్యాక్:
ఈ మధ్య కాలంలో కొరియన్స్ ఉపయోగించే, బియ్యం నీటి ఫేస్ ప్యాక్, సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కోరియన్స్ మాదిరిగానే జుట్టు మరియు చర్మం మెరవాలని, బియ్యం నీటిని తలకు మరియు మోకానికి ఉపయోగిస్తున్నారు. బియ్యం పిండితో తయారు చేసిన స్క్రబ్ ఉపయోగించడం ద్వారా చర్మం శుభ్రపడటంతోపాటు, చర్మానికి సహజ మొయిశ్చరైజర్ లాగా పనిచేస్తుంది. బియ్యం పిండితో స్క్రబ్ చెయ్యడం ద్వారా చర్మానికి సహజమైన నిగారింపు మరియు తేమ అందుతుంది. బియ్యం కడిగిన నీటిలో, బియ్యం పిండి కలిపి ఫేస్ ప్యాక్ లాగా వేసుకోవాలి, ఇది మొఖాన్ని మెరిసేలా చేస్తుంది. 
ఫేస్ ప్యాక్ తయారుచేసుకోవడం ఎలా?
ఇంట్లోనే సహజంగా ఫేస్ ప్యాక్ తయారుచేసుకోవడానికి రెండు స్పూన్ల బియ్యం పిండి, చిటికెడు పసుపు, కలబంద జెల్, రెండు స్పూన్ల పచ్చి టమాటో రసం వేసి బాగా కలపాలి. ఇప్పుడు ఈ పేస్ట్ ని మోకానికి పట్టించి పావుగంట సేపు వదిలెయ్యాలి, తరువాత మోకానీ మసాజ్ చేసి, నీటితో కడగాలి. ఈ విధంగా ఈ ఫేస్ వాష్ ను ప్రతిరోజు ఉపయోగిస్తే కొద్దీ రోజుల్లో తేడా తెలుస్తుంది. 

అదే విధంగా మొఖానికి త్వరగా కాంతిని అందించడం కోసం, బియ్యం పిండి, రెండు స్పూన్ల రోజ్ వాటర్, మరియు ఒక స్పూన్ తేనే వేసి, దీనిని ఒక మిశ్రమంలా తయారుచేసి, మొఖానికి పట్టించాలి. ఈ పేస్ ప్యాక్ ను అరగంట సేపు వదిలేసి, తరువాత శుభ్రమైన నీటితో కడిగితే ముఖానికి త్వరగా మెరుపు వస్తుంది. మెడ నలుపు రంగులో ఉండేవారు కూడా ఈ మిశ్రమాన్ని వినియోగించవచ్చు.

Share your comments

Subscribe Magazine