Health & Lifestyle

పోస్టాఫీస్‌ పథకం: నెలకు రూ. 1500 పెట్టుబడి పెట్టి...రూ. 35 లక్షలు పొందండి!

S Vinay
S Vinay

గ్రామీణ ప్రజల కోసం ఉద్దేశించిన కార్యక్రమాలను ప్రవేశపెట్టిన ఇండియా పోస్టాఫీస్‌ ఇప్పుడు తన గ్రామీణ కార్యక్రమంలో భాగంగా గ్రామ సురక్ష పథకాన్ని రూపొందించింది.

ఈ పథకం కింద, నెలకు రూ. 1500 పెట్టుబడి పెట్టవచ్చు మరియు మెచ్యూరిటీపై దాదాపు రూ. 35 లక్షలు పొందవచ్చు. ఈ పథకం పొందడానికి కనిష్ఠంగా 19 మరియు గరిష్టంగా 55 సంవత్సరాలు ఉండాలి.ఈ పథకంలో మీరు రూ.10,000 నుండి రూ.10 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు.ఈ పథకంలో ప్రీమియంలను ప్రతి నెల, త్రైమాసికం, ఆరు నెలలు మరియు వార్షిక ప్రాతిపదికన చెల్లించవచ్చు.అంతే కాకుండా ప్రీమియం చెల్లించడానికి 30 రోజుల సడలింపు కూడా ఉంటుంది.

19 సంవత్సరాల వయస్సులో గ్రామ సురక్ష పాలసీలో రూ.10 లక్షలు పెట్టుబడి పెడితే, నెలవారీ ప్రీమియం 55 సంవత్సరాలకు రూ.1,515, 58 సంవత్సరాలకు రూ.1,463 మరియు 60 సంవత్సరాలకు రూ.1,411. 55 ఏళ్ల బీమా కోసం మెచ్యూరిటీ ప్రయోజనం రూ. 31.60 లక్షలు కాగా, 58 ఏళ్ల పాలసీకి రూ. 33.40 లక్షలు. 60 ఏళ్ల మెచ్యూరిటీ ప్రయోజనం రూ.34.60 లక్షలుగా ఉంది.

లోన్ కూడా పొందవచ్చు
మీరు పోస్టాఫీసు గ్రామ సురక్ష పథకంలో పెట్టుబడి పెట్టడం ద్వారా అనేక లోన్ పొందగలరు అయితే, ఈ పథకంలో 4 సంవత్సరాలు ఇన్వెస్ట్ చేసిన తర్వాత మాత్రమే ఈ సదుపాయం అందుబాటులో ఉంటుంది.

లబ్ధిదారుడు మూడు సంవత్సరాల తర్వాత పాలసీని సరెండర్ కూడా చేయవచ్చు అయితే ఇలాంటి సందర్భంలో మీరు ఎలాంటి గ్రామ సురక్ష పథక ప్రయోజనాలను పొందలేరు.


మరిన్ని చదవండి.

ఎవరెస్ట్ ని అధిరోహించిన తెలుగమ్మాయి!

ఇప్పుడు వాట్సాప్‌లో తక్షణమే హోమ్ లోన్ అందిస్తున్న బ్యాంకు!

Share your comments

Subscribe Magazine