Health & Lifestyle

షుగర్ పేషెంట్స్ వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే

KJ Staff
KJ Staff
sugar
sugar


ప్రస్తుత కాలంలో షూగర్ సమస్య ప్రజలను వేధిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా చాలామంది ఈ వ్యాధి బారిన పడుతుండగా.. ఇండియాలో కూడా డయాబెటిస్ బాధితుల పెద్ద సంఖ్యలో ఉన్నారు. షూగర్ వచ్చిందని మన చుట్టుపక్కల మనం రోజూ వింటూ వింటాం. మన బంధువుల్లోనే ఎవరో ఒకరు ఈ వ్యాధి బారిన పడుతూ ఉంటారు. టైమ్ కి తినకపోవడం, తీపి వస్తువులు ఎక్కువగా తినడం వల్లన షూగర్ వ్యాధి వస్తుంది. ఒకసారి వస్తే కంట్రోల్ లోకి తీసుకురావడం చాలా కష్టమవుతుంది. మనకి ఇష్టమైన ఫుడ్ ను వదులుకోవాల్సి వస్తుంది. డైట్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది.

షుగర్ వస్తే ఇక పోదని, జీవితాంతం ఇలాగే ఉండాల్సి వస్తుందనే భయం చాలా మందిలో ఉంటుంది. ఈ భయం వల్లనే చాలామంది ఒత్తిడికి గురై మరింత అనారోగ్యానికి గురవుతున్నారు. అయితే డైట్ పాటించడం, వ్యామాయం చేయడం వల్ల షుగర్ లెవల్స్‌ను తగ్గించుకోవచ్చు. మెడిసిన్స్ వాడటం కన్నా.. డైట్ పాటించడం, ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవడం వల్ల డయాబెటిస్ ను శరీరం నుంచి వెళ్లగట్టవచ్చు.

అయితే వర్షాకాలం వచ్చిందంటే.. సీజనల్ వ్యాధులు బాధిస్తూ ఉంటాయి. దగ్గు, జలుబు, జ్వరం లాంటి సీజనల్ వ్యాధులు వస్తూ ఉంటాయి. దీంతో వర్షాకాలంలో డయాబెటిస్ రోగులు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఇతరులతో పోలిస్తే డయాబెటిస్ రోగుల్లో ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉంటుంది. అందుకే డయాబెటిస్ పేషెంట్స్ ఆరోగ్యంపై మరింత జాగ్రత్తగా ఉండల్సి వస్తుంది. దీంతో వర్షాకాలంలో షుగర్ పేషెంట్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

వర్షాకాలంలో డయాబెటిస్ పేషెంట్స్ నీళ్లు ఎక్కువగా తాగాలి. చెమట ద్వారా శరీరంలోని నీళ్లు బయటకు పోతాయి. శరీరానికి సరిపోయేంత నీళ్లు శరీరంలో లేకపోతే డీహైడ్రేడ్ కు గురయ్యే అవకాశముంటుంది. దీంతో నీళ్లు ఎక్కువగా తాగుతూ ఉండాలి. ఇక కొబ్బరి నీళ్లు కూడా తాగొచ్చు.

ఇక బయటి ఆహారం తినడం వల్ల ఇన్పెక్షన్లకు గురయ్యే అవకాశముంది. అందుకే ఇంట్లో వండిన ఫుడ్ మాత్రమే తీసుకోవాలి. పచ్చి కూరగయాలను తినకపోవడం మంచిది. కూరగయాలను వెనిగర్ లేదా నిమ్మరసం కలిసిప గోరు వెచ్చని నీటిలో ముంచి తీయడం ద్వారా బ్యాక్టీరియా చనిపోతుంది. అలాగే వేడివేడిగా ఉన్న ఆహారాన్ని మాత్రమే తినాలి.

ఇక వానాకాలంలో చల్లని వాతావరణం వల్ల క్రీములు, బ్యాక్టీరియాలు చాలా శక్తివంతంగా ఉంటాయి. త్వరగా ఇన్ఫెక్షన్‌ సోకేలా చేస్తాయి. అందుకే రోజూ వేడి నీళ్లతో స్నానం చేయాలి. చేతులను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ ఉంటాలి. గోళ్లలోకి మట్టి చేరి బ్యాక్టీరియాలు చేరుతాయి. గోళ్లను ఎప్పటికప్పుడు కత్తిరించుకోవాలి.

వానాకాంలో తడి బట్టలను అసలు వేసుకోవద్దు. ఇక పాదాలు శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. శుభ్రంగా లేకపోతే డయాబెటిక్ ఫూట్ సమస్య ఏర్పడే అవకాశముంది. అలాగే తడి బట్టలు వేసుకోవడం వల్ల వెంటనే జ్వరం వస్తుంది. అందుకే పోడి బట్టలను మాత్రమే వేసుకోవాలి. వర్షాకాలంలో డయాబెటిస్ పేషెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోవడం వల్ల అరోగ్యంగా ఉండవచ్చు.

Share your comments

Subscribe Magazine