News

భారత దేశ అతిపెద్ద అగ్రిమీడియా కృషి జాగరణ్ 26 వార్షికోత్సవ సంబరాలు..

Srikanth B
Srikanth B
India's largest Agri Media "Krishi Jagran "Celebrating 26 anniversary
India's largest Agri Media "Krishi Jagran "Celebrating 26 anniversary


భారతదేశం వ్యవసాయ ఆధారిత దేశం మరియు దేశంలో దాదాపు 70 శాతం జనాభా వ్యవసాయం మరియు వ్యవసాయ సంబంధిత రంగాలపై ఆధార పడి ఉన్నారు , భారతదేశానికి వ్యవసాయం వెన్నుముకవంటిది అదేక్రమంలో రైతులకు మరియు వ్యవసాయ రంగ నిపుణులకు మధ్య ఉన్న ఖాళీని పూరించి , రైతులకు అధునాతన వ్యవసాయ సమాచారం అందించాలనే ఉద్దేశంతో 1996 సెప్టెంబర్ 5 న ఎం.సి డొమినిక్ వ్యవసాయ మ్యాగజైన్ (Magazine ) కృషి జాగరణ్, ఆంగ్లం లో అగ్రికల్చర్ వరల్డ్ ను స్థాపించారు . నేటితో 26 వసంతాలు పూర్తిచేసుకున్న సందర్భం గ కృషి జాగరణ్ ఫౌండర్ అండ్ ఎడిటర్ చీఫ్ ఎం.సి డొమినిక్ ,డైరెక్టర్ షైనీ డొమినిక్ , కృషి జాగరణ్ టీం రైతులతో కలసి దృశ్య మాధ్యమం లో 26 వ వార్షికోత్సవాలను నిర్వహించారు .

ఈ 26 సంవత్సరాల ప్రయాణంలో ఎన్నో ప్రత్యేకతలను, మైలురాయిలను కృషి జాగరణ్ అధిగమించింది. 12 భాషలు తెలుగు ,తమిళం ,కన్నడ , మలయాళం , అస్సామీ ,గుజరాతి ,పంజాబీ ,బెంగాలీ ,ఒడియా ,మరాఠీ ,హిందీ ,ఇంగ్లీష్ లో ప్రచురితం అయ్యే ఏకైక భారతీయ వ్యవసాయ మ్యాగజైన్ గ "లిమ్కా బుక్ ఆఫ్ రికార్డు " సాధించింది అదేవిధం గ 12 భాషలలో డిజిటల్ మాధ్యమంలో రైతుల కోసం వెబ్సైటు కలిగివున్న ఏకైక అగ్రిమీడియా పేరుగాంచింది , రైతుల సమస్యలను వినిపించడానికి రైతుల గొంతుకగా FTJ ఫార్మర్ ది జర్నలిస్ట్ నుం స్థాపించింది మరియు అగ్రి జర్నలిస్టు లను ఒకే తాటిపై తీసుకురావడానికి AJAI (అగ్రికల్చర్ జర్నలిస్ట్ అసోసియేషన్ అఫ్ ఇండియా ) ను స్థాపించింది .

26 సంవత్సరాల లో ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటు భారతదేశంలోనే అగ్రగామి వ్యవసాయ రంగ మీడియా "కృషి జాగరణ్ " అవతరించింది . 26 వార్షికోత్సవం సందర్భముగ కృషి జాగరణ్ ఫౌండర్ అండ్ ఎడిటర్ చీఫ్ ఎం.సి డొమినిక్ మాట్లాడుతూ ప్రతి రైతు గడపకు "కృషి జాగరణ్ మ్యాగజిన్ చేరాలనే సంకల్పంతో స్థాపించబడిన కృషి జాగరణ్ ఇప్పడు దేశవ్యాప్తంగా 180 మిలియన్ విజిటర్ ను సాధించిందని వెల్లడించారు .

ఉపాధ్యాయుల దినోత్సవం: మీకు ఇష్టమైన ఉపాధ్యాయునికి మీరు ఇవ్వగల ఉత్తమ బహుమతుల జాబితా..

Share your comments

Subscribe Magazine