News

ఇలాంటి వారికి పీఎం కిసాన్ వర్తించదు.. కారణాలేంటో తెలుసుకోండి

KJ Staff
KJ Staff

రైతులకు చేయుతగా నిలిచేందుకు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విషయం తెలిసిందే. గత లోక్‌సభ ఎన్నికలకు కొద్దిరోజుల ముందు మోదీ ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. గతంలో 5 ఎకరాలలోపు పొలం ఉన్నవారికి మాత్రమే ఈ పథకాన్ని వర్తింపచేశారు. కానీ 5 ఎకరాలపైన పోలం ఉన్నవారికి కూడా ఈ పథకాన్ని వర్తింపజేయాలని రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయం తీసుకున్నారు.

కుటుంబంలో ఇద్దరు, ముగ్గురు పేర్ల మీద పోలం ఉన్నా.. అందరికీ ఈ పథకం వర్తిస్తుంది. ప్రతి ఏడాది మూడు విడతలుగా రూ.6 వేలను నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తోంది. ఇప్పటికే 7 విడతల నగదును రైతుల ఖాతాల్లో జమ చేయగా.. 8వ విడత డబ్బులను ఈ నెల 20 నుంచి 25 మధ్య జమ చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది.


అయితే అన్ని అర్హతలుండి అప్లై చేసుకున్నా పీఎం కిసాన్ డబ్బులు రాలేదని చాలామంది బాధపడుతుంటారు. అలాంటి వారు ఈ పథకం అర్హతలకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవాల్సి ఉంటుంది.

ఇలాంటి వారికి పీఎం కిసాన్ వర్తించదు

-సాగు చేసే పొలం మన పేరు మీదే ఉండాలి
-ఇంట్లో తండ్రి, తల్లి పేరుపై ఉంటే డబ్బులు రావు
-కౌలు రైతులకు ఈ పథకం వర్తించదు
-భూమిని సాగుకు కాకుండా ఇతర అవసరాలకు ఉపయోగించినా డబ్బులు రావు
-ఇంట్లో నెలకు రూ.10 వేలు పైన పెన్షన్ పొందేవారు ఉంటే డబ్బులు రావు
-ఇక రిజిస్ట్రేషన్ ఫామ్‌లో ఏవైనా తప్పులు ఉంటే డబ్బులు రావు
-ప్రభుత్వ ఉద్యోగులు, డాక్టర్లు, ఇంజినీర్లు, లాయర్ల, సీఏలు, వారి కుటుంబసభ్యులకు ఈ పథకం వర్తించదు.


పైన చెప్పిన వాటిని గమనించి ఈ పథకానికి అర్హులో.. కాదో తెలుసుకుని అప్లై చేసుకుండి. మీకు అన్ని అర్హతలు ఉంటే తప్పనిసరిగా పీఎం కిసాన్ పథకం డబ్బులు వస్తాయి.

Share your comments

Subscribe Magazine