Health & Lifestyle

ట్రాన్సజెండర్లకు ఆయుష్మాన్ భారత్- పీఎంజే కింద సమగ్ర ఆరోగ్య సేవలు

Srikanth B
Srikanth B

లింగమార్పిడి చేసుకున్న వ్యక్తులకు ( ట్రాన్సజెండర్) ఆయుష్మాన్ భారత్- పీఎంజే కింద సమగ్ర ఆరోగ్య సేవలు అందించేందుకు వీలు కల్పించే చరిత్రాత్మక ఒప్పందంఫై ఈరోజు ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ అమలు చేస్తున్న జాతీయ ఆరోగ్య మిషన్, సామాజిక న్యాయం మరియు సాధికారత శాఖ సంతకాలు చేశాయి. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ, సామాజిక న్యాయం మరియు సాధికారత శాఖ మంత్రి డాక్టర్ వీరేంద్ర కుమార్ సమక్షంలో నేషనల్ హెల్త్ అథారిటీ సీఈఓ డాక్టర్ ఆర్.ఎస్.శర్మ, సామాజిక న్యాయం మరియు సాధికారత శాఖ కార్యదర్శి శ్రీ.ఆర్.సుబ్రహ్మణ్యం ఒప్పందంపై సంతకాలు చేశారు.

ఒప్పందంపై హర్షం వ్యక్తం చేసిన డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ఒప్పందం కుదిరిన ఈ రోజు అత్యంత ముఖ్యమైన రోజని అన్నారు. ఒప్పందం వల్ల లింగమార్పిడి చేసుకున్న వారు ఆయుష్మాన్ భారత్- పీఎంజే కింద సమగ్ర ఆరోగ్య సేవలు పొందుతారని అన్నారు. దీనివల్ల లింగమార్పిడి చేసుకున్న వారు సమాజంలో గౌరవప్రదమైన స్థానం పొంది జీవించగలుగుతారని అన్నారు. సమాజంలో పరివర్తన తెచ్చేందుకు సాగుతున్న ప్రయత్నాలకు ఈ రోజు కుదిరిన అవగాహన ఒప్పందం పునాదిగా నిలుస్తుందని మంత్రి అన్నారు. సామాజికంగా వెనుకబడి ఉన్న ట్రాన్సజెండర్ వర్గానికి ఈ ఒప్పందం వల్ల సమగ్ర ఆరోగ్య సేవలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. ట్రాన్సజెండర్లకు సమాజంలో గుర్తింపు, గౌరవం లభించడం లేదని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. కళంకిత ముద్ర పడిన ట్రాన్సజెండర్లను సమాజం వెలి వేసినట్లు చూస్తున్నదని అన్నారు. అన్ని వర్గాలకు సమానత్వం, గుర్తింపు, గౌరవం లభించే విధంగా నవ సమాజ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తున్నాదని డాక్టర్ మాండవీయ వివరించారు. దీనిలో భాగంగా ట్రాన్సజెండర్లకు సమగ్ర ఆరోగ్య సంరక్షణ సేవలు అందించే విధంగా ఒప్పందం కుదిరిందని అన్నారు.

రైతుల నుండి "జాతీయ గోపాల రత్న అవార్డు" కోసం దరఖాస్తులు ఆహ్వానం..మొదటి బహుమతి రూ.5 లక్షలు

దేశంలో బలమైన రాజకీయ సంకల్పంతో పరివర్తనాత్మక మార్పు తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రి డాక్టర్ వీరేంద్ర కుమార్ అన్నారు. విద్య, గౌరవప్రదమైన జీవితం, ఆరోగ్య సహకారం , జీవనోపాధికి అవకాశాలు మరియు నైపుణ్యం పెంపుదలపై ఇచ్చిన ఐదు హామీలు అమలు చేసేందుకు కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ అమలు చేస్తున్న చర్యలను ఆయన వివరించారు. దేశంలో అట్టడుగు మరియు వెనుకబడిన వర్గాలకు చెందిన ప్రజలకు గౌరవప్రదమైన జీవితం మరియు జీవనోపాధిని అందించడం లక్ష్యంగా కార్యక్రమాలు అమలు జరుగుతున్నాయని మంత్రి అన్నారు.

రైతుల నుండి "జాతీయ గోపాల రత్న అవార్డు" కోసం దరఖాస్తులు ఆహ్వానం..మొదటి బహుమతి రూ.5 లక్షలు

Share your comments

Subscribe Magazine