News

యూరియా స్థానం లో యూరియా ను విసర్జించే సూక్ష్మజీవులు !

Srikanth B
Srikanth B

రసాయన ఎరువుల ద్వారా ఏర్పడే కాలుష్యాన్ని నివారించడానికి వాషింగ్టన్ స్టేట్ యూనివర్సిటీ పరిశోధకులు రసాయన ఎరువుల స్థానం సేంద్రియ పద్దతిలో లో అమ్మోనియాను ఉత్పత్తి చేయడానికి , మట్టిలో నత్రజని స్థిరీకరించడానికి అవసరమైన మట్టి బాక్టీరియా అజోటోబాక్టర్ వైన్లాండి అన్నే జాతులను జన్యుక్రమాలు మార్చడం ద్వారా మొక్క లకు అవసరమైన నత్రజనిని విసర్జించే బాక్టీరియాలను సృష్టించే విధంగ పరిశోధనలు సాగిస్తుంది .

ఈ పరిశోధన ద్వారా సృష్టించ బడిన బాక్టీరియాలు కాలుష్యానికి  తగ్గించే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి . ఈ అధ్యయనం అమెరికన్ సొసైటీ ఫర్ మైక్రోబయాలజీ యొక్క జర్నల్ అప్లైడ్ అండ్ ఎన్విరాన్ మెంటల్ మైక్రోబయాలజీలో ప్రచురించబడింది.

"ఈ  బాక్టీరియాలు ద్వారా విసర్జించబడిన  అమ్మోనియా వరి మొక్కలకు  నేరుగా రవాణా చేయబడుతుందని అని వాషింగ్టన్ స్టేట్ యూనివర్సిటీ యొక్క ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయోలాజికల్ కెమిస్ట్రీలో అసిస్టెంట్ రీసెర్చ్ ప్రొఫెసర్ ఫ్లోరెన్స్ మస్, పి.హెచ్.డి. చెప్పారు. "పారిశ్రామిక ఎరువుల స్థానంలో తము  తయారు చేసిన సూక్ష్మజీవులతో ఎరువులను అందించడం ద్వారా పర్యావరణ కాలుష్యం తగ్గు తుందని అయన అన్నారు .

నైట్రోజన్ స్థిరీకరణ గురించి మరింత తెలుసుకోవాలనే కోరికతో ఈ పరిశోధన కొనసాగుతుందని , ఇది నత్రజని చక్రంలో భాగంగా వాతావరణ నైట్రోజన్ సేంద్రియ అణువుల్లో విలీనం చేయబడే రసాయన ప్రక్రియలను సూచిస్తుంది. "మా పరిశోధన ఒక నమూనా నైట్రోజన్-ఫిక్సింగ్ బాక్టీరియాలో జన్యు వ్యక్తీకరణను ప్రభావితం చేసే యంత్రాంగాలను మరింత మెరుగ్గా అర్థం చేసుకోవడానికి దోహదపడుతుంది మరియు ఎ.వైన్లాండిలో అమ్మోనియా విసర్జనకు దారితీసే జీవరసాయనశాస్త్రంయొక్క స్పెసిఫికేషన్ కు దోహదపడుతుంది, అని ముస్ అన్నారు .

అధికంగా నైట్రోజన్ ఎరువులను వాగుల్లో కడిగినప్పుడు ఏర్పడే తీవ్రమైన నీటి కాలుష్య సమస్యలను తగ్గించాలనే లక్ష్యంతో ఈ పరిశోధన నిర్వహించారు. దీని ఫలితంగా ఆల్గాల్ బ్లూమ్స్ ఏర్పడతాయి, ఇది ఆక్సిజన్ ను క్షీణింపజేస్తుంది మరియు చేపలు మరియు ఇతర జలచరాలను చంపుతుంది, ఫలితంగా సరస్సులు, నదులు మరియు మహాసముద్రాలలో "మృత మండలాలు" ఏర్పడతాయి.

,వీటిని నిర్ములించడానికి  పరిశోధకులు నిరంతరం అమ్మోనియాను సృష్టించే సూక్ష్మజీవులను సృష్టిస్తున్నారు. అయితే, వివిధ వ్యవసాయ మొక్కల అవసరాలను తీర్చడానికి వివిధ రేట్లలో అమ్మోనియాను సృష్టించడానికి విభిన్న ఎ.విన్లాండి సమూహాలను రూపొందించగలమని శాస్త్రవేత్తలు ఆశిస్తున్నారు.

ఇంకా చదవండి:

వ్యవసాయ స్టార్ట్-అప్ లకు రాష్ట్రీయ కృషి వికాస్ యోజన కింద రూ.25 లక్షలు (krishijagran.com)

రసాయన ఎరువుల దిగుమతి , సరఫరా నియంత్రణ చట్టాన్ని సవరించనున్నకేంద్రప్రభుత్వం (krishijagran.com)

Share your comments

Subscribe Magazine