News

వ్యవసాయ చట్టాల రద్దు వద్దు .... సుప్రీంకోర్టు నియమించిన త్రిసభ్య కమిటీ నివేదిక!

Srikanth B
Srikanth B

గత ఏడాది నవంబర్ లో  పార్లమెంటు రద్దు చేసిన మూడు వ్యవసాయ చట్టాలను అధ్యయనం చేయడానికి సుప్రీంకోర్టు నియమించిన ప్యానెల్, రైతులకు ప్రయోజనకరంగా ఉంటుందని పేర్కొంటూ ఈ మూడు చట్టాలను రద్దు చేయవద్దని సిఫారసు చేసింది.

మార్చి 19, 2021న సుప్రీం కోర్టుకు సమర్పించిన ఈ నివేదికను సోమవారం బహిర్గతం చేశారు.

కనీస మద్దతు ధర (ఎమ్ఎస్పి) వ్యవస్థను చట్టబద్ధం చేయడానికి రాష్ట్రాలకు స్వేచ్ఛ ఇవ్వడంతో సహా చట్టాలలో అనేక మార్పులను త్రిసభ్య కమిటీ సూచించింది. ప్యానెల్ సభ్యుల్లో ఒకరైన అనిల్ ఘన్వత్ దేశ రాజధానిలో విలేకరుల సమావేశంలో నివేదిక ఫలితాలను విడుదల చేశారు.

'2021 మార్చి 19న సుప్రీంకోర్టుకు నివేదిక సమర్పించాం. నివేదికను విడుదల చేయాలని కోరుతూ మేము మూడుసార్లు సుప్రీం కోర్టుకు లేఖలు రాశాము. కానీ మాకు ఎలాంటి స్పందన రాలేదు' అని స్వతంత్ర భారత్ పార్టీ అధ్యక్షుడు ఘన్వత్ తెలిపారు.

నేను ఈ రోజు ఈ నివేదికను విడుదల చేస్తున్నాను. ఈ మూడు చట్టాలను రద్దు చేశారు. వీటి గురించి వలసిన  అవసరం లేదు కానీ ఈ నివేదిక భవిష్యత్తులో వ్యవసాయ రంగానికి విధానాలను రూపొందించడంలో సహాయపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

ఈ చట్టాలను రద్దు చేయడం లేదా సుదీర్ఘంగా నిలిపివేయడం వ్యవసాయ చట్టాలకు మద్దతు ఇచ్చే  మెజారిటీకి  రైతులకు అన్యాయం అవుతుందని కమిటీ తన నివేదికలో పేర్కొన్నట్లు ఘన్వత్ తెలిపారు.

కమిటీకి సమర్పించిన రిపోర్టులో 73 రైతు సంఘాల్లో 3.3 కోట్ల మంది రైతులకు ప్రాతినిధ్యం వహిస్తున్న 61 రైతు సంఘాలు వ్యవసాయ చట్టాలకు మద్దతిచ్చాయని తెలిపారు.సంయుక్త్ కిసాన్ మోర్చా పేరుతో చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనలు నిర్వహించిన 40 సంఘాలు పదేపదే విజ్ఞప్తి చేసినప్పటికీ ఎలాంటి వినతిపత్రం ఇవ్వలేదని ఘన్వత్ తెలిపారు.

వ్యవసాయ ఆర్థికవేత్త అశోక్ గులాటీ, వ్యవసాయ వ్యయాలు, ధరల కమిషన్ మాజీ చైర్మన్ ప్రమోద్ కుమార్ జోషి కూడా ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు.నవంబర్ 19న ప్రధాని నరేంద్ర మోదీ జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో మూడు వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారు.

మూడు చట్టాలు - ఫార్మర్స్ ప్రొడ్యూస్ ట్రేడ్ అండ్ కామర్స్ (ప్రమోషన్ అండ్ ఫెసిలిటేషన్) చట్టం; రైతుల (సాధికారత మరియు రక్షణ) ధర హామీ మరియు వ్యవసాయ సేవల ఒప్పందం చట్టం; మరియు ఎసెన్షియల్ కమోడిటీస్ (సవరణ) చట్టం - రద్దు చేయబడ్డాయి.

మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయడం ఢిల్లీ సరిహద్దుల్లో ఈ సంస్కరణలకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్న సుమారు 40 రైతు సంఘాల ప్రధాన డిమాండ్లలో ఒకటి.

2020 నవంబర్ చివరిలో ప్రారంభమైన ఈ నిరసన మూడు చట్టాలను పార్లమెంటు రద్దు చేసిన తరువాత ముగిసింది. ఈ చట్టాలు జూన్ 2020 లో అమలులోకి వచ్చాయి మరియు నవంబర్2021 లో రద్దు చేయబడ్డాయి.

పాడి పరిశ్రమ లో సిరులు కురిపించే 5 గేదె జాతులు !

Heavy Rain Alert! భారీ వర్ష సూచనా ! వచ్చే 24 గంటల్లో "ఆసాని" తుఫాను తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం!

 

 

Share your comments

Subscribe Magazine